వైసీపీ నాయకుడు అకస్మాత్తుగా రూటు మార్చేశాడు.. విమర్శల విషయంలో కొత్త బాణీ కనిపెట్టాడు. దాని కారణంగా మీడియా అటెన్షన్ సాధించాడు. ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టడంటూ ఆయన పదే పదే చేస్తున్న కామెంట్లు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. పలుచోట్ల ఆందోళనలకు కారణమవుతున్నాయి. 

ఈ ఆందోళనలు పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక వైఎస్ జగన్ ప్రస్తుతం పర్యటిస్తున్న అనంతపురం జిల్లాలో పోలీసులు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. జగన్ వ్యాఖ్యల కారణంగా జరిగిన గొడవల్లో వైసీపీ వారిపైనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ వారిని వదిలేస్తున్నారని వదంతలు ఉన్నాయి.

నాలుగు సింహాల వెనుక గుంటనక్కలా బాబు - జగన్.. 



ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై మరోసారి విమర్శలతో రెచ్చిపోయారు. ఈ సమయంలో పోలీసులు జాగ్రత్తగా డ్యూటీ చేయాలని రైతు భరోసా యాత్రలో జగన్ సూచించారు. పోలీసులు ఎప్పుడూ తమ తలపై ఉన్న టోపీలోని మూడు సింహాలను చూసి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. 

కానీ కొంత మంది ఆ నాలుగు సింహాల వెనక గుంటనక్కలా దాగి ఉన్న చంద్రబాబును గుర్తించలేకపోతున్నారని విమర్శించాడు జగన్. ఇప్పటివరకూ చెప్పుతో కొడతాను, చీపురుతో కొడతాను అన్న జగన్.. ఇప్పుడు ఏకంగా గుంటనక్క అంటూ విర్శించడం మొదలు పెట్టాడు. ఇంకా ముందు ముందు ఎన్ని బూతులు వినాలో అనుకుంటున్నారు ఏపీ జనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: