ఉబయకుశలోపరి. మీకు మావేదన తెలపటానికి భాగ్యనగరములోని అభాగ్యుడైన బాంకు ముందు 2000/- కోసం క్యూలో నిలబడ్డ ఇక సామాన్యుడు రాసుకున్న విన్నపములు. ప్రశ్నలు. మోడీ గారు మీరేం చేస్తున్నారు? సామాన్య ప్రజల 50 రోజుల సహకారం కోరిన మీకు ప్రజలు ఇప్పటికి ఇంకా 18 రోజుల దూరంలోనే ఉన్నారు. మీనుంచి ఎలాంటి పురోభివృద్ధి కనిపించటం లేదు. దేశంలో 15% ఏటిఎం లు కూడా పనిచేయటం లేదని తెలుస్తుంది. సాధారణ ప్రజలు తమ హక్కులు ప్రక్కన పెట్టి మీరు చెప్పినట్లే వారానికి 24 వేలు నగదు తమ ఖాతాల నుండి తీసుకుందామన్నా బాంకుల్లో "నో కాష్"