బీజేపీ జాతీయ సమావేశాల్లో కటువైన పదజాలంతో విరుచుకుపడిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. మోడీకి జాతీయ స్థాయికి ఎదిగే సామర్థ్యం లేదని విమర్శించింది. కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.... మోడీ వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట, నేతగా ఎదగాలంటే మంచి పనులు చేయాలని సూచించారు ‘ మా నుంచి కాకుంటే వాజ్ పేయి నుంచి నేర్చుకో’ అని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే ముందు అద్దంలో నిన్ను నువ్వుచూసుకో, దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ ప్రాణత్యాగాలు చేసిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. మీరు 14 రోజులైనా జైల్లో ఉన్నారా? కనీసం మీకు చిన్న గాయమైనా అయ్యిందా? అని మోడిని ప్రశ్నించారు. సొంత డబ్బా కోసం కోట్లు కుమ్మరిస్తున్న మోడీని ఎవరైనా జాతీయ నాయకుడని పొరబడితే తప్పులో కాలేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: