కమ్యూనిస్టులకు కంచుకోట గా పేరొందిన ఖమ్మం జిల్లా నుంచి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. తాజాగా ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం సిపిఐ పార్టీకి చెందిన మాజీ ఎమెల్యే పాయం వెంకటేశ్వర్లు సతీసమేతంగా ఈరోజు చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు మంతనాలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. పేద ప్రజలకోసం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలుచేయడంలో కిరణ్ కాంగ్రెస్ విఫలమైందని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాలో చేరి జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటూ పార్టీ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఆయన వైకాపా లో చేరికతో  ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గం తోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి కూడ పెద్ద ఎత్తున వైకాపా గూటికి మొగ్గు చూపుతున్నారని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: