ఎంపీ(పోతరాజు) వినూత్న నిరసన ఎంటా? అని ఆశ్చర్యంగా ఉంది కదా..? ఔను మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్టీలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మంగళవారంనాడు వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది తెలిసిందే. అయితే చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ దేశప్రజలను సోనియాగాంధీ నుండి రక్షించమని, రాష్ట్ర ప్రజలను కిరణ్ కుమార్ రెడ్డి నుండి రక్షించాలంటూ తన నిరసనను వినూత్న రీతిలో(పోతరాజు వేశధారణ) తెలియజేశారు. చొక్కావిప్పి... చండ్రకొరడా చేతబూని తన వీపు భాగానికేసి కొట్టుకుంటూ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్ చార్జీలతో రాష్ట్రంలోని పేద ప్రజలు అల్లాడుతుంటే... విద్యుత్ సమస్యలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తుందని, సీఎం కీరణ్ కుమార్ రెడ్డి... తేరగా వచ్చిన పదవి నుంచి తేరుకుని ప్రజలకు నాలుగు మంచిపనులు చేసి దిగిపోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.    
  

మరింత సమాచారం తెలుసుకోండి: