జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిష్టీలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఏ-4 నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె రాజీనామా లేఖను సీఎంకు సమర్పించారు. అయితే సీబీఐ సమగ్రంగా పరిశోధించిన తర్వాతే ఛార్జిషీటులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు చేర్చిందని కేంద్రమంత్రి వాయలార్ రవి అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి కేసులో ఇది సహజంగా జరిగేదేనని వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడటానికి అంతగా ఏమీ లేదని వాయలార్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: