దేశ రాజధానిలో తెలంగాణ జేఏసీ చేపట్టిన సంసద్ యాత్ర సత్యాగ్రహ దీక్షలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత త్రిపాఠి హాజరయ్యి దీక్షకు  తన సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్బంగా త్రిపాఠి మీడియాతో ముచ్చటిస్తూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో తాము చేరబోతున్నామని, తెలంగాణ ఉద్యమంలో ఇక నుండి ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా దీక్షలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ విషయంలో ఇక నిర్లక్ష్యం తగదని వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: