భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత ఎన్నో వినూత్న పథకాలు తీసుకు వచ్చారు. అంతే కాదు ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ప్రజలకు బాగా చేరువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిందే..పెద్ద నోట్ల చెలామణి రద్దు. దేశంలో పేరుకు పోయిన నల్లదనం బయటకు తీసుకు రావడానికి పెద్ద నోట్లు 500, 1000 రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 500, 2000 తీసుకు వచ్చారు. ట్లు రద్దుకు ముందు 86శాతం అంటే 17.9 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో వుండేది.
జూన్ 9 నాటికి 14.6 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో వున్నట్లు లెక్కలు వెలువడుతున్నాయి. రోజువారీ నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది ఆర్బీఐ. త్వరలో రూ.200 నోట్లను అందుబాటులో తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తోంది. ప్రింటింగ్ పనులను మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లోవున్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్నివారాల కిందట నోట్ల ముద్రణ పనిని అప్పగించారు.
మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొంతకాలం క్రితమే ఈ నోట్ల ముద్రణ మాధ్యతను అప్పగించారు. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రఅతిలో రూ.200 నోట్లలో అదనపు భద్రత పరమాణాలు చేర్చారు. రూ.100, రూ.500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.