కులభూషన్ జాదవ్తో కుటుంబసభ్యుల సమావేశానికి భారత్ పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తరువాత, దౌత్యపరమైన షరతులను ఇరుదేశాలు అంగీకరించిన తర్వాత ఆయన తల్లి భార్య ఆయన్ను కలిసిన సమయంలో వారికి ఆ తృప్తిని కూడా మిగల్చకుండా పాకిస్థాన్ కనీస దౌత్య నిభందనల్లోని ఒక్క నిభందనని ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు.
మానవతా దృక్పథంతో ఆదేశ "జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా" పవిత్ర జయంతి రోజున కులభూషన్ జాదవ్ను అతని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి స్తున్నాం అంటూ గొప్పగా ప్రచారం చేసుకొన్న పాకిస్థాన్ విదేశాంగ శాఖ, వృద్ధురాలైన జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్ పట్ల అత్యంత హేయంగా వ్యవహరించింది. వీరి వెంట పాకిస్థాన్కు వెళ్లిన డిప్యూటీ హైకమిషనర్ను లోపలికి పంపించినప్పటికీ, ఆయన్ను జాదవ్తో మాట్లాడనివ్వలేదు.
కులభూషణ్ జాదవ్ను కలిసే అవకాశం కలిపించడం ద్వారా తాము ఎంతో ఔదార్యాన్ని చూపించామంటూ, ట్విట్టర్ ద్వారా, మీడియా ద్వారా పదే పదే అనేక ఫొటోలు షేర్ చేసిన పాకిస్థాన్ ప్రభుత్వ అసలు స్వరూపం బయటపడింది. జాదవ్ కుటుంబ సభ్యులు పాకిస్థాన్లో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఒకరకమైన భయానక వాతావరణాన్ని అధికారులు కల్పించారు.
ఇక పాక్ మీడియా అధికారున ప్రోద్భలంతో రెచ్చిపోయింది. నోటి కొచ్చిన కారు కూతలు కూసింది. 22 ఏళ్ల పాటు పాక్ అక్రమ నిర్బంధంలో ఉన్న కన్నకొడుకును,కట్టుకున్న భర్తను చూసుకునేందుకు ఎంతో ఆతృతగా ఇస్లామాబాద్ వెళ్లిన కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యారు. పాక్ అధికారుల సాక్షిగా అక్కడ మీడియా జాదవ్ కుటుంబ సభ్యులపై తమ ప్రతాపం చూపింది. అసలే ఆవేదనలో మ్రగ్గిపోతున్న తల్లి భార్యను మాటలతో చేతలతో హింసించారు పాక్ అధికారులు. అనుక్షణం ఒప్పంద నియమాలను ఉల్లంగిస్తూ, పాక్ మీడియాను అనుమతించరాదన్న నిబంధనను సైతం పాక్ అధికారులు తుంగలోకి తొక్కారు.
దొడ్డిదారిన అనుమతింన, పాక్ మీడియా - జాదవ్ ను కలుసుకుని బయటకు వచ్చిన ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్ కుల్ జాదవ్ లపై పాక్ మీడియా విరచుకు పడింది. తిరిగి వాళ్ళిద్దరూ కారు వద్దకు చేరే లోపే మీడియా చుట్టు ముట్టి అనకూడని రావకూడని మాటలతో వారిని విపరీత మానసిక క్షోభకు, అవమానానికి గురిచేసింది. అవంతి జాదవ్ ను "హంతకుడి తల్లి" అని సంబోధిస్తూ, నీ హంతక తనయుడిని చూసిన తర్వాత నీకేలా అనిపించింది? అంటూ ప్రశ్నలతో వేదించారు. ఇంకా అనేక ప్రశ్న లతో జర్నలిస్టు అవంతి జాదవ్ను కార్నర్ చేశారు. హంతక తనయుణ్ణి చూసేందుకు పెద్ద మనసుతో అన్గీకరించిన పాకిస్థాన్ దయార్ధ ప్రభుత్వానికి కృతఙ్జతలు చెబుతారా? లేదా? అంటూ మరొకరు నిలదీశారు.