దక్షిణ కొరియా టూర్ లో ఉన్న తెలంగాణ మంత్రి కేటీ రామారావు  పర్యటన గ్రాండ్ సక్సస్ దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆయన పలు కంపెనీల నుంచి పెట్టుబడుల హామీలు 
సంపాదించారు. ప్రత్యేకించి యంగ్ వన్ సంస్థ  తెలంగాణలో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమైంది. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఈ పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణకొరియాకు చెందిన యంగ్ వన్ సంస్థ ముందుకొచ్చింది. 

హ్యుందాయ్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడితో కేటీఆర్ సమావేశం

కేటీఆర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో వివిధ కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. హ్యుండాయ్ కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నామ్ గ్యూహ్ నో తో సమావేశమైన కేటీఆర్... టీఎస్ ఐపాస్, అనుమతులకు ఏకగవాక్ష విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. హ్యూండాయ్ రోటెం గ్లోబల్ రైల్ సంచాలకులు కేకే యూన్ తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. 



రైల్వే ఉపకరణాల తయారీ, రక్షణ ఉత్పత్తుల్లో ఈ కంపెనీ ఈ కొరియాలో ప్రముఖమైనది. హైదరాబాద్ లో రక్షణ పరిశ్రమకు ఉన్న అనుకూలతలను వివరించిన మంత్రి... పెట్టుబడులు పెట్టాలని కోరారు. కోఫోటి సంస్థ ఛైర్మన్ కిహుక్ సంగ్ తో సమావేశమైన కేటీఆర్ కంపెనీ నెలకొల్పిన యంగ్ వన్ కార్పోరేషన్ ను సందర్శించారు. వరంగల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో 300 అమెరికా డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యంగ్ వన్ కార్పోరేషన్ ముందుకొచ్చింది. 



హోయ్ సంగ్ సంస్థ ఉపాధ్యక్షులు జేయ్ జూంగ్ లీతో సమావేశమైన కేటీఆర్  కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ కు చెందిన చోయ్ డాంగ్ జిన్ ను కలిసిన కేటీఆర్  వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కు హాజరు కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం, అసోసియేషన్ మధ్య ఆసక్తివ్యక్తీకరణ ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వివేక్, ఐటీ-పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కూడా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: