భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పసి పిల్లలు మొదలు.. పండు ముదుసలి అనే తేడాలేవీ లేకుండా లైంగిక దాడులకు తెగబడుతున్నారు కామంధులు. ఓ వైపు ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకు వచ్చినా..కఠిన చట్టాలు అమలు పరుస్తున్నా..ఇవేవీ లెక్కచేయకుండా మహిళలపై దారుణ అకృత్యాలు కొనసాగిస్తున్నారు కొంత మంది దుర్మార్గులు.
తాజాగా యూపీలో మరో ఘోరం చోటుచేసుకుంది. నెలలు నిండిన గర్భిణిపై కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన చూసి పలువురు నింధితులకు కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకివెళితే.. కచౌలా గ్రామానికి చెందిన బాధిత మహిళ బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బయటకు వెళ్లిన మహిళ ఎంత సేపటికీ రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా.. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో స్పృహతప్పి పడిఉండటాన్ని అవాక్యయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పై అత్యాచారానికి వడిగట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.