ఈ మద్య నగరంలో దొంగలు బాగా రెచ్చిపోతున్నారు.  ఈజి మనీ కోసం అక్రమ మార్గంలో వెళుతూ..చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయిందని పోలీసులు చెబుతున్నా..నగరంలో రోజు రోజుకీ మాఫీయా, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, భూ కబ్జాలు ఇలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల ఇళ్ల నుంచి సెలబ్రెటీల ఇళ్ల వరకు సింపుల్ గా దోచేస్తున్నారు.  తాజాగా ఎమ్మెల్యే, నటి రోజా ఇంట్లో ఇంట్లో భారీ చోరీ జరిగింది.  ఈ ఘటన ఆమె నివాసం ఉంటున్న మణికొండలో జరిగింది.

రూ. 10 లక్షల విలువైన బంగారు హారం కనిపించకుండా పోయిందని..ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో మాదాపూర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బీరువాలో పెట్టిన విలువైన హారం ఎలా అపహరణకు గురైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పనివాళ్లే ఎవరైనా తీశారా? లేక బయటివాళ్లు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఇంట్లో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చునని రాయదుర్గం పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే రోజా నివాసానికి చేరుకొని పరిశీలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: