గ్రూప్ 1 అధికారి అంటే సమాజంలో చాలా గౌరవం.. స్టేట్ లో టాప్ క్యాడర్ పోస్టు అది. అందులోనూ గ్రూప్ 1 పోలీస్ అధికారి అంటే ఆ క్రేజే వేరు. పాపం.. అలాంటి ఓ మహిళా అధికారి అక్రమ సంబంధం కారణంగా ఇప్పుడు అభాసుపాలైంది. నాలుగు గోడల మధ్య వ్యవహారం రోడ్డున పడి ఇప్పుడు పరువు గంగపాలైంది.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అక్రమ సంబంధం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
పోలీస్ శాఖలో గతంలోనూ ఇలాంటి ఓ రాసలీల వ్యవహారం రచ్చయింది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఖాకీజంట అక్రమసంబంధం వెలుగు చూసింది. అప్పట్లో అది సంచలనమే అయ్యింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్లీ పోలీసు శాఖలో ఇదే తొలి అక్రమ సంబంధం. కెపిహెచ్బీ కాలనీలోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీలో ఈ బాగోతం వెలుగు చూసింది.
అవినీతి నిరోధక శాఖ మహిళా ఏఎస్పీకీ.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డికీ అక్రమ సంబంధం ఉందట. ఆమె 2007 గ్రూప్ వన్ అధికారిగా పోలీస్శాఖలో ప్రవేశించింది. 2010లో ఆమె సురేందర్రెడ్డిని వివాహం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ దిగుమతుల వ్యాపారం చేసే సురేందర్రెడ్డి వ్యాపారం కోసం తరచు లండన్ వెళ్లేవారు. ఇక్కడ ఈ అధికారిణి మల్లికార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. ఆమె భర్త ఆరోపిస్తున్నారు. వీరిపై గతంలోనూ ఫిర్యాదులున్నాయట. 2016లో సురేందర్రెడ్డి భార్యను నిలదీశాడట
అప్పట్లో ఏదో ఒకటి సర్ది చెప్పిన భార్యామణి.. మళ్లీ కొంతకాలానికి పాత ప్రియుడితో రొమాన్సు మొదలుపెట్టింది. వీరిద్దరి వ్యవహారంపై అనుమానంతో ఉన్న ఏఎస్పీ భర్త సురేందర్రెడ్డి.. కొంతకాలంగా వీరిపై నిఘా పెట్టాడు. రెండు రోజుల కిందట లండన్ నుంచి తిరిగి వచ్చిన అతను... ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి నగరానికి వచ్చినట్టు తెలుసుకున్నాడు. ఏఎస్పీ నివాసం వద్దకు అతను వచ్చినట్టు తెలుసుకొని తన కుటుంబసభ్యులతో కలిసి అక్కడ మాటు వేశాడు. మల్లికార్జున్ బయటకు రావడం గమనించి బంధువులతో కలిసి అతన్ని పట్టుకొని దేహశుద్ది చేశాడు.