మన సొసైటీలో సెలబ్రెటీలంటే యమా క్రేజ్.. వాళ్లను చూడాలని వాళ్లతో మాట్లాడాలని చాలా మంది తెగ ఉబలాటపడిపోతుంటారు. వాళ్ల కోసం గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఒక విధంగా సెలబ్రెటీలు కూడా ఈ తరహా ఆదరణ కోరుకుంటారు. అయితే ఒక్కోసారి ఆ అభిమానం సెలబ్రెటీలను కూడా తెగ ఇబ్బందిపెడుతుంది. వ్యక్తిగత పనులు చేసుకునే అవకాశం కూడా వారికి ఉండదు. 

anchor anasuya angry కోసం చిత్ర ఫలితం
ఆ సమయంలో వారికి కలిగే చిరాకు అంతా ఇంతా కాదు.. అందుకే సినీహీరో బాలయ్య లాంటి వారు అప్పుడప్పుడు అభిమానులని కూడా చూడకుండా లెంపకాయ ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఇలాగే ఇబ్బంది పడింది. ఆమె తన వ్యక్తిగత పని మీద తార్నాక వచ్చింది. అక్కడ ఆమెను గుర్తుపట్టిన ఓ బాలుడు ఫోన్లో ఫోటోలు తీశాడట. 

anchor anasuya angry కోసం చిత్ర ఫలితం
ఐతే.. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందో ఏమో కానీ.. అనసూయ ఒక్కసారిగా ఆ బాలుడి చేతిలోని సెల్ ఫోన్ లాగేసుకుని.. నేలకేసి కొట్టిందట. అడక్కుండా ఫోటోలు తీస్తావా అంటూ తిట్టిపోసిందట. ఇదంతా అక్కడే ఉండి గమనించిన ఆ బాలుడి తల్లి అనసూయపై మండిపడిందట. ఫోటో తీస్తే మాత్రం ఫోన్ పగలగొట్టేస్తావా అంటూ అనసూయతో గొడవపెట్టుకుందట. 


ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత అనసూయ రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయిందట. దీంతో ఆగ్రహించిన ఆ బాలుడి తల్లి ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అనసూయపై కేసు పెట్టిందట. అనసూయ పగలగొట్టిన ఫోన్ ను సాక్ష్యంగా చూపించిందట. ఓ యూ పోలీసులు కేస్ నమోదు చేసుకున్నారు. మరి అనసూయపై ఏం చర్యలు తీసుకుంటారో ఏమో.. చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: