ఈ మద్య హైదరాబాద్ లో దారుణమైనే హత్యలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చి తీర్చి దిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మరోవైపు నేర సామ్రాజ్యం కూడా విస్తరిస్తుంది. ఆ మద్య డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. ఈ మద్య అక్రమసంబంధాలతో భర్తలను పొట్టన బెట్టుకున్న భార్యల ఉదంతం మరువక ముందే మరో దారుణం చోటు చేసింది. అక్రమ సంబంధంతో ఓ గర్బిణిని దారుణంగా ముక్కలు చేసి బస్తాలో కుక్కి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసిన కేసులో పోలీసులకు హంతకుల ఆనవాళ్లు దొరికాయి.
శవాన్ని బైక్పై తీసుకొచ్చి పడేసినట్టు సీసీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. గత నెల 30న వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు 10కి పైగా వీడియోల ను విశ్లేషించి హంతకుల్లో ఒక మహిళ, ఒక పురుషు డు ఉన్నట్టు గుర్తించారు. వారికి మరొకరు సహా యం చేసి ఉంటారని భావిస్తున్నారు. సంచలనం సృష్టించిన 8 నెలల గర్భిణి బింగి హత్య కేసులో కీలక నిందితుడు అమర్కాంత్ ఝ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు అతడిని బిహార్లో అదుపులోకి తీసుకున్నారు.
తల్లి ఆదేశంతోనే అమర్కాంత్... స్టోన్ కటింగ్ మెషీన్తో బింగి శరీర భాగాలను ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీని బట్టి మృతురాలు స్థానికురాలై ఉంటుందనే అనుమానం తో బైక్ను పట్టుకునేందుకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి సమీపంలోని సిద్ధిక్నగర్, అంజయ్యనగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుడి ఫొటో, బైక్ ఫొటోను అందరికీ చూపిస్తూ ఆరా తీశారు. అయినా ఎటువంటి క్లూ లభించలేదని తెలిసింది. కాగా ఆ ప్రాంతంలో ఎక్కువగా బిహార్, మద్య ప్రదేశ్ కి చెందిన వారే ఎక్కువగా నివసిస్తున్నట్లు తేలింది.
బైక్ నంబర్ను సేకరించి దాని ఆధారంగా విచారణ జరిపారు. కాగా, హత్యకు గురైన మహిళను పింకీగా గుర్తించిన పోలీసులు హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేల్చారు. పింకీతో సహజీవనం చేస్తోన్న వికాస్కు ఇంటి యజమానితో అక్రమ సంబంధం ఉందని గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె నిలదీయడంతో దారుణంగా హతమార్చారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు హంతకులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వికాస్ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో నిందితులైన మమతా ఝా, అనిల్ ఝా, అమర్కాంత్ ఝా, వికాస్ కశ్యప్లను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.