ఈ మద్య మానవత్వం పూర్తిగా నశించిపోయాయని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి.  ఓ గర్బిణిని దారుణంగా చంపి ముక్కులుగా చేసి గోనె సంచిలో దాచిన సంఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది..ఈ కేసులో నింధితులు చెప్పిన నిజాలు చూస్తే..మానవత్వం అసలు ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక అక్రమ సంబంధాలతో కట్టుకున్న భర్తలను కడతేర్చిన భార్యల ఉదంతం..నమ్మించి వస్తే..దారుణంగా చంపి పూడ్చి పెట్టిన సంఘటనలు చూస్తుంటే..అసలు మనం సమాజంలో ఉన్నామా..మన చుట్టు ఉన్నవారు ఇంత ఘోరంగా ఉన్నారా అని భయం వేస్తుంది.
Crime: Indian-origin soldier in UK on trial for murder
తాజాగా ఓ దుర్మార్గుడు బాలున్ని హత్య చేసి నెల రోజుల పాటు   సూట్‌కేసులోనే దాచిన ఘటన నార్త్‌వెస్ట్‌ ఢిల్లీలోని స్వరూప్‌ నగర్‌లో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే..అవదేశ్‌ శాక్య(27) అనే యువకుడు కొంత కాలంగా స్వరూప్‌నగర్‌ కరణ్ సింగ్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. అవదేశ్‌ యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడని పోలీసులు చెప్పారు.  మూడు సంవత్సరాలుగా కరణ్‌ సింగ్‌ ఇంట్లో అద్దెకు ఉండేవాడని..కుటుంబ సభ్యులతో ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చాడని..కానీ అలాంటి వాడే  ఆశీస్‌(7) అనే బాలుడిని దారుణంగా చంపి సూట్ కేసులో దాచాడన్న నిజం తెలిసి కుటుంబ సభ్యులు నిర్ఘాంత పోయారు.
Image result for upsc aspirant kills landlords
అయితే ఆశీస్‌(7) చంపడానికి ఆ నింధితుడు చెప్పిన కారణాలు చూస్తే పోలీసులు ఆశ్చర్యపోయారు.  కరణ్‌ సింగ్‌ ఇంట్లో అద్దెకున్న అవదేశ్ తో ఆశీష్‌ తల్లిదండ్రులు అవదేశ్‌తో మాట్లాడవద్దని చెప్పేవారని, దానితో వారిపై కసితో అవదేశ్‌ ఈ అకృత్యానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే..ఆశీష్‌ను చంపిన తరువాత కూడా అవదేశ్‌ ఏమీ తెలియని వాడిలా కరణ్‌ సింగ్‌ ఇంటికి రాకపోకలు సాగించాడు.
Image result for upsc aspirant kills landlords
తన కొడుకు కనిపించకుండా పో​యాడని కరణ్‌ సింగ్‌ పోలీసుకలకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు కూడా అతని వెంట అవదేశ్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడి శవాన్ని వేరే చోటికి మార్చే ప్రయత్నంలో అవదేశ్‌ శాక్య అడ్డంగా దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: