ఏపీకి కేంద్రం అన్యాయం చేయడంపై టీడీపీ నేతల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు.  ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. గల్లా జయదేవ్ ని నేనొక్కటే ప్రశ్నిస్తున్నాను. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెడతారా? ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా? సమయానికి టాయిలెట్లు కట్టకపోతే కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ చంద్రబాబునాయుడు వారిని బెదిరిస్తున్నారు.
Image result for ap special status
మరి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వనప్పుడు కేంద్రంపై పోరాటం చేస్తానని చంద్రబాబు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రత్యేక హోదా అనేది వైఎస్ ఆర్ గారి కొడుకు జగన్ లాంటిది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైన, ఆ పార్టీ ఎంపీలపైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో పదవులూ కావాలి, ఇటు సన్నాయి నొక్కులు నొక్కాలన్నట్టుగా టీడీపీ ఆడుతున్న డ్రామాలను చూస్తున్నాం. ఈరోజున ఆ డ్రామాలు ఏ స్థాయికి వెళ్లాయంటే .. మహానటుడు ఎన్టీఆర్ ని మించిన నటనను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు.
Image result for parliament tdp mp protest
కేంద్రం తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశారని మరొక నేత పార్లమెంట్ వద్ద చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రత్యేక ప్యాకేజ్ అనేది చంద్రబాబునాయుడు ఇంట్లో ఉన్న ఎవరికీ పనికి రాని పప్పు లాంటిది.
Image result for ఆంధ్రప్రదేశ్ బంద్..విజయవాడలో గుండు
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ప్రతి జిల్లా హైదరాబాద్ లా అవుతుందని నాలుగేళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారు  అని రోజా అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఏపీకి ప్రత్యేక హోదాను సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: