ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ధారుణంగా పార్లమెంట్ తలుపులు మూసేసి అన్యాయంగా అనైతికంగా అక్రమంగా విభజించబడ్డ రాష్ట్రాన్ని చంద్రబాబు ఈ నాలుగేళ్ళ పాలనలో మరింతగా భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమపాలన ఎప్పుడు అంతమవుతుందా? అని రాష్ట్ర ప్రజలు నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు.
భారతదేశంలోనే అతి పెద్ద అవినీతిపరుడు నారా చంద్రబాబు అని ఎంపీ మేకపాటి నిప్పులు చెరిగారు. అవినీతి అక్రమ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో చంద్రబాబు కి బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఏ అవసరం ఉండి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను చంద్ర బాబు అక్రమంగా అమాంతంగా లాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రధాని నరేంద్రమోదీ కూడా నమ్మడం పూర్తిగామానేశారని, అందుకే విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు కొత్త డ్రామా లు మొద లెట్టారని విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 5వరకు పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని, అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ముందుగా మా ఎంపీలందరం రాజీనామా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ఉక్కు మనిషి అని, ఆయన పోరాటాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపరని ఎంపీ మేకపాటి తెలిపారు.