మనదేశంలో నూటికి 80శాతం పెళ్లిళ్లు సంప్రదాయబద్దంగానే జరుగుతాయి. అబ్బాయి, అమ్మాయిలకు యుక్తవయస్సు రాగానే పెళ్లి సంబంధాలు చూస్తారు.. పెద్దలు నిర్ణయించిన వివాహాల కన్నా ప్రేమ పెళ్లిళ్లలో ఎక్కువ స్వేచ్చ ఉంటుందని మహిళలు భావిస్తారు. తమకు నచ్చినవాడితో మనువు తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందనుకుంటారు. అన్నింటికీ మించి పెళ్లి తమ ఇష్టానికి అనుకూలంగా జరిగిందన్న ఆనందం వారికి మరింత ఉపశమనాన్నిస్తుంది.
కానీ ప్రేమ పెళ్లిళ్లు అన్నిసార్లూ సంతోషాన్నివవని ఈ ఉదాహరణ చెబుతుంది. కోల్ కతా కు చెందిన దీప.. ప్రశాంత్ ను కాలేజీ రోజుల్లోనే ప్రేమించింది. ఇద్దరూ మూడేళ్ల వరకూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకున్నారు. దీప తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. వారు కూడా అభ్యుదయ భావాలున్నవారు కావడంతో పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు.
కానీ పెళ్లయిన కొన్ని రోజులకే ప్రశాంత్ నిజస్వరూపం బయటపడింది. తరచూ అతడు దీపపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేవాడు.. కోపం వస్తే చేయి కూడా చేసుకునే వాడు. అంతే కాదు. పడక గదిలోనూ విచిత్రంగా ప్రవర్తించేవాడు.. తన రొటీన్ శృంగారం ఆనందం ఇవ్వడంలేదని కొత్తగా ట్రై చేద్దామని విసిగించడం ప్రారంభించాడు. చివరకు దీప వారిస్తున్నా వినకుండా యానల్ సెక్స్ కు ప్రయత్నించాడు.
దీంతో సహనం కోల్పోయిన దీప.. అతన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ప్రశాంత్ తో నరకం కంటే.. పుట్టింటికి వెళ్లడమే కరక్ట్ అనుకుంది. ఫోన్ చేసి తండ్రికి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పింది. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కంటే తన ఆనందమే తనకు ముఖ్యం అనుకుంది దీప. విషయం క్రమంగా తెలుసుకున్న పెద్దలు ప్రశాంత్ కు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ వారిద్దరినీ కలిపే ప్రయత్నంలో ఉన్నారు.