వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఏపీని పరిపాలించిన శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరు. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ ను ప్రజానురంజకంగా పరిపాలించిన చరిత్ర ఆయనది. అనేక సంక్షేమపథకాలకు ప్రాణం పోసి సామాన్యుల మెప్పు పొందిన నాయకుడు. సుదీర్ఘ కాలం ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన 2004లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 

Related image
ఆ తర్వాత వరుస సంక్షేమపథకాలు అమలుచేసి ప్రజల మనసు గెలుచుకుని మరోసారి 2009లోనూ అధికారంలోకి వచ్చాడు. అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందడం అప్పట్లో రాష్ట్రంలో ఓ సంచనలం. ఆయన మరణవార్త విని వందల సంఖ్యలో జనం గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. 

Image result for ys rajasekhara reddy
అలాంటి నాయకుడి జీవితాన్ని ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. ఆనందో బ్రహ్మ చిత్రంతో సత్తా నిరూపించుకున్న మహి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పేరు కూడా యాత్ర అని వినిపిస్తోంది. వైఎస్సార్ పాదయాత్రకు గుర్తుగా కావచ్చు ఆ పేరు పెడుతున్నారు. మరి ఆ పాత్రకు ఎవరు సరిపోతారు.. ఈ అన్వేషణ ఇప్పుడు ఫలించింది. 

Image result for mammootty
ఈ సినిమాలో వైఎస్సార్ గా మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆయనతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాట. ఇప్పటివరకూ పెద్దగా అంచనాలు లేకున్నా మమ్ముట్టి పేరు తెరపైకి రావడంతో ఈ యాత్రకు మంచి క్రేజ్ వచ్చేఅవకాశాలు కనిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: