తెలంగాణలో రాజకీయాలు దిగజారిపోతున్నాయా.. ఏకంగా ముఖ్యమంత్రి మరణిస్తారంటూ కాంగ్రెస్ ప్రచారం చేసిందా.. ఈ విషయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో బయటపెట్టిన విషయం సంచలనం సృష్టిస్తోంది. ఆయన అనూహ్యంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన ఆరోగ్యంపై కాంగ్రెస్ కావాలని దుష్ప్రచారం చేస్తోందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. 

Image result for KCR IN ASSEMBLY
కేసీఆర్ కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందట. దీనిపై కేసీఆర్ ఏమన్నారంటే.. 'నాకేదో జబ్బు వచ్చినట్టు.. అందుకే అమెరికాకు పోతున్నట్టు.. కేసీఆర్ అక్కడే చచ్చిపోతాడన్నట్టు నాలుగు సంవత్సరాలుగా నాపై విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇన్నేళ్లా?.. వినడానికే బాధనిపిస్తోంది అధ్యక్షా' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Image result for KCR DEATH

నిజంగా కేసీఆర్ చెప్పినట్టుగానే అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. కానీ జనం వాటిని అంతగా విశ్వసించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏకంగా స్వామిగౌడ్ పై అసెంబ్లీలోనే దాడి చేయడంతో ఈ విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించి కాంగ్రెస్ ను మరింత ఇరుకున పెట్టారు. టీఆర్ఎస్ పై కాంగ్రెస్ మొదటి నుంచి పార్టీ కక్షపూరితంగా ప్రవర్తిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: