మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ తో దాడి చేసి, ఆయన కళ్లకు గాయం చేశారన్న ఆరోపణలపై నిన్న కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన తెలంగాణ అసెంబ్లీ, గత రాత్రి ఆ విషయాన్ని గెజిట్ ద్వారా వెల్లడించింది.  ఈ రోజు సంచలన నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయడంతో మంగళవారం రాత్రి నుంచి ఎమ్మెల్యే సంపత్ తోపాటు కోమటిరెడ్డి 48గంటల దీక్షను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  గెజిట్ ప్రతిని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపుతూ, తమ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయని పేర్కొంది. నేడు గెజిట్ నోటిఫికేషన్ పై ఎన్నికల కమిషనర్ స్పందించే అవకాశాలు ఉన్నాయి.  బుధవారం ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్‌లో తాను పర్యటించినందుకే కేసీఆర్ తనపై కక్ష పెంచుకున్నారని అన్నారు.
రాహుల్‌కీ చెప్పాం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజీనామాల అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా సమాచారం ఇచ్చామని కోమటిరెడ్డి తెలిపారు. ఏఐసీసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కోమటిరెడ్డి తెలిపారు. త్వరలోనే రాహుల్ గాంధీతో మహబూబ్ నగర్, నల్గొండలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. 
ఉప ఎన్నికలకు సిద్ధం
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు మరో 14 నెలల సమయం ఉండటంతో ఉప ఎన్నికలు జరిపించేందుకు ఈసీ మొగ్గు చూపుతుందా? లేదా? అన్న విషయం తెలియాల్సి వుంది. నేడు కాంగ్రెస్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించనుండగా, అక్కడ వారికి ఊరట లభించి, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై స్టే వస్తే, ఎప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాజీనామాలకు సిద్ధం

మరింత సమాచారం తెలుసుకోండి: