కృష్ణాజిల్లాలోని గుడివాడ రాజేంద్రనగర్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. బోప్పన సాయి చౌదరి (72) బోప్పన నాగమణి (67) ఒంటరిగా  ఉన్న వృద్ధ దంపతులను చంపిన దుండగులు కారు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన దుండగులు.. దంపతులను తీవ్రంగా గుడివాడ రాజేంద్రనగర్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. బోప్పన సాయి చౌదరి (72) బోప్పన నాగమణి (67) ఒంటరిగా  ఉన్న వృద్ధ దంపతులను చంపిన దుండగులు కారు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన దుండగులు.. దంపతులను తీవ్రంగా కొట్టి చంపేశారు. వృద్ధ దంపతులను చంపి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలతో దొంగలు ఉడాయించారు. అనంతరం అదే ఇంట్లో ఉన్న కారులోనే దుండగులు పరారయ్యారు.

ఇంట్లో హల్ లో రక్తం మడుగులో మృతదేహలును ఉదయం వచ్చిన పని మనిషి ఈ దారుణాన్ని చూసి స్థానికులకు సమాచారం అందించింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగల పనా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పనిమనిషి వచ్చి తలుపులు తీయగా ఈ ఘోరం వెలుగుచూసింది.

అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు. డాగ్ స్వ్కాడ్ తో కూడా తనిఖీలు  పోలిసులు నిందితుల అచూకి కోసం ప్రత్యేక పోలిస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నగరంలో ఎర్పటు చేసిన సి సి కెమెరా లను కూడా పరిశీలిస్తున్న పోలిసులు. కాగా, ఇంట్లో ఈ దారుణానికి పాల్పడిన వాళ్లు దొంగతనానికే వచ్చారా.. మరేదైన కారణంతో వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రజలు ఆ ప్రాంతానికి బారులు తీరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: