హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో మూడో రోజు పర్యటనలో ఉన్నారు. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణ అధి కారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేశ్ భారీగా అవినీతికి పాల్పడ్డారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. శనివారం అనంతపురం జిల్లాకు వచ్చిన బాలకృష్ణ, మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేప్రయత్నం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారని విలేకరులు ప్రశ్నించగా, "తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి ఒక్కటే అజెండా. ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తుంటారు. వాటిని మేం పట్టించుకోం. పవన్ కల్యాణ్ పై నేనేదో మాట్లాడి అతణ్ణి హీరోని చెయ్యడం మాకు ఇష్టంలేదు. ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు. మేమే సూపర్స్టార్లం ఇప్పటికీ, ఎప్పటికీ మేమే హీరోలం" అని బాలకృష్ణ అన్నారు.
శనివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంజీఎం క్రీడా మైదానంలోని ₹ 2 కోట్లతో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియానికి మరమ్మతులు చేపట్టామని, విద్యార్థులకు ఇండోర్ స్టేడియం ఎంతో అవసరమని చెప్పారు. ఒక ప్రయివేట్ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హిందుపురం అభివృద్ధికి ఎల్లవేళా పాటుపడతామని తెలిపారు.