సమాజంలో జరిగే నేరాల్లో చాలావరకూ అక్రమ సంబంధాలకు, లైంగిక సంబంధాలకు సంబంధించినవే అయి ఉంటున్నాయి. మనిషి ఏ విషయంలో రాజీ పడినా.. లైంగిక సంబంధాల విషయంలో మాత్రం రాజీపడలేకపోవడమే ఇందుకు కారణంకావచ్చంటాడు మానసిక నిపుణులు.. కృష్ణా జిల్లాలో ఓ హోంగార్డు ఇలా ఓ పెళ్లయిన ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నగర శివారు నున్న మామిడి పాకల సమీపంలో సుబ్బయ్యకుంట పొలాల్లో శ్యామ్ ప్రసాద్ అనే హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అవమానభారంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల శ్యామ్ ప్రసాద్ ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు ఈ విషయం భర్త కనిపెట్టాడు.
ఒకటి, రెండుసార్లు బెదిరించి చూసినా ఫలితం మాత్రం కనిపించలేదు. దాంతో వివాహిత భర్త సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు హోంగార్డ్ శ్యామ్ కి ఉన్నతాధికారులు గట్టిగా మందలించారు. దీంతో ఉద్యోగం పోతుందేమోనని శ్యామ్ ప్రసాద్ భయపడిపోయాడు. అందులోనూ అక్రమ సంబంధం కారణంగా ఉద్యోగం పోతే.. ఆ విషయంబయటకు వస్తే పరువు పోతుందని ఫీలయ్యాడు.
ఇంటి నుండి బయటకి వెళ్లిపోయిన శ్యామ్ ప్రసాద్ అప్పటి నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా.. నున్న మామిడి పాకల పొలాల్లో శ్యామ్ ప్రసాద్ శవం కనపడింది. నోటి నుంచి నురగ ఉండటంతో పురుగుల మందు తాగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.