గుంటూరు జిల్లా వినుకొండ మండలం పెదకంచెర్లలో ఓ తమాషా ప్రమాదం జరిగింది. భార్య భర్తల గొడవ కారణంగా ఏకంగా ఊరంతా ఇబ్బందుల్లో పడింది. పెళ్లంపై కోపంతో ఓ మొగుడు ఏకంగా సొంత ఇంటికే నిప్పుపెట్టేశాడు. ఆ నిప్పుకాస్తా ఒక్కొక్కటిగా ఊరంతా అంటుకుంది. అసలు ఇంతకూ ఏమైందంటే..

Image result for wife and husband fighting

వినుకొండ మండలం పెదకంచెర్లలో మద్దినేని వీరాంజనేయులుకు, ఆయన భార్యతో గొడవ జరిగింది. భర్త కోపంతో భర్త సొంత ఇంటికే నిప్పంటించాడు. ఇంటికి పక్కనే ఉన్న కోళ్ల ఫారాలు, వరి గడ్డి వాములు దగ్ధమయ్యాయి. అంతేకాదు.. ఆ నిప్పు క్రమంగా వ్యాపించి.. పక్కనే ఉన్న రిలయన్స్ టవర్ కు మంటలు వ్యాపించాయి.

Image result for wife and husband fighting

వీరాంజనేయులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైన వంట నూనె పోసి నిప్పటించాడు. ఈ మంటలతో పక్కనే మూడు కోళ్ల ఫారాలు దగ్థమయ్యాయి. ఫారాల్లో ఉన్న 5 వేల కోళ్లు చనిపయాయి. ఆ పక్కనే ఉన్న రైతుల వరి గడ్డి వాములు దగ్ధమయ్యాయి. దీంతో ఊరు ఊరంతా ఘొల్లుమంది.


వెంటనే గ్రామస్తులు ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేశారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. భార్యపై కోపం వచ్చి సొంతింటి తగులబెట్టుకోవడమే కాకుండా ఊరంతా వల్లకాడుగా మార్చేశాడీ కోపధారి భర్త. పేరుకు తగ్గట్టే వీరావేశం ప్రదర్శించి అందర్నీ హడలెత్తించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: