హైపర్ ఆది.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ బుల్లితెర నటుడు ఇప్పుడు సెలబ్రెటీ లెవల్లో పోజు కొడుతున్నాడు. అంతే కాదు.. పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చే ఈ నటుడు ఆయన్ను ఎవరు ఏమన్నా ఊరుకోడు. ఈ పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్ కారణంగా కత్తి మహేశ్ తో హైపర్ ఆది గొడవపెట్టుకున్న విషయం తెలిసిందే. 


ఉప్పు నిప్పులా ఉండే హైపర్ ఆది, కత్తి మహేశ్ ఇటీవల ఓ షోలో ఒకే వేదికపై కలుసుకున్నారు. ఇప్పుడు ఆ షోకు సంబంధించిన ట్రైలర్ కలకలం సృష్టిస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఆ షోలో హైపర్ ఆది కత్తి మహేశ్ ను ఓ ఆట ఆడుకున్నట్టుగా కనిపిస్తోంది. లైవ్ లోనే కత్తి మహేశ్ పై పంచ్ లు వేస్తూ ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంది. అయితే అసలు  ప్రోగ్రామ్ లో ఉన్నది వేరని కత్తి మహేశ్ అంటున్నారు. 


ఐతే.. ఈ ప్రోగ్రామ్ లో కత్తి మహేశ్ పై సెటైర్లు వేసిన హైపర్ ఆది పనిలో పనిగా టీవీ9 పైనా కౌంటర్లు వేశారు.. కత్తి మహేశ్ పనీపాటా లేకుండా బొక్కలే టీవీ ఛానల్ కు వెళ్లి కూర్చుంటాడని సెటైర్లు వేశారు. ఇందకీ సదరు బొక్కలే ఛానల్ అంటూ కామెడీ చేసింది టీవీ9 నే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కత్తి మహేశ్ ను లైవ్ కు ఎక్కువగా పిలిచేది టీవీ9 మాత్రమేకదా. 



ఈ విషయాన్ని టీవీ9 డిస్కషన్లోనే కత్తి మహేశ్ తాజాగా చెప్పడం విశేషం. ఈ షోకు వెళ్లినందుకు మీరు అవమానం ఫీలయ్యారా.. అని టీవీ9 యాంకర్ అడిగితే.. హైపర్ ఆది అరాచకాన్ని బయటపెట్టేందుకే.. ఆయన్ను ఫూల్ ను చేసేందుకే ఈ షోకు వెళ్లానన్నారు. ముందు ఈ షో అని తనకు తెలియదని.. కానీ తెలిశాక వెనక్కు రాకూడదని ఉండిపోయా అంటూ కత్తి మహేశ్ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: