భారత దేశంలో దొంగబాబాలు ఈ మద్య ఎక్కువే అయ్యారు.  భక్తి అనే ముసుగులో ప్రజలను దారుణంగా మోసం చేస్తూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు.  దేవుడి పేరు చెప్పి అందినంత దండుకుంటున్నారు. ఆ మద్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసులో ఎన్నో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
Image result for dera baba
తాజాగా డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. డేరాబాబాకి అండగా నిలిచిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడిస్తూ... అజ్ఞాత వ్యక్తి ఒకరు పంజాబ్-హర్యానా హైకోర్టుకు లేఖరాశాడు. గతేడాది ఆగస్టు 26న పంచకుల కోర్టు డేరాబాబాను దోషిగా నిర్ధారించిన తర్వాత ఏం జరిగిందీ... డేరా హెడ్‌క్వార్టర్స్ నుంచి అక్రమ ఆయుధాలు, డబ్బు, ఇతర సామాగ్రిని ఎలా తరలించిందీ అందులో వివరించాడు.
Image result for dera baba
అక్రమాయుధాలు, డబ్బు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం డేరా నిర్వాహకులు హర్యానా సీఐడీ చీఫ్ అనిల్ రావు, డీఎస్పీ అజిత్ సింగ్‌లకు భారీ మొత్తంలో లంచమిచ్చినట్టు పేర్కొన్నాడు. ఈ ఇద్దరు పోలీసు అధికారులు దాదాపు 65 కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్కులను ఎలాంటి డేటా దొరక్కుండా ధ్వంసం చేసినట్టు వెల్లడించాడు.
Image result for dera baba protest
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి రవీందర్ సింగ్ ధూల్‌ని ఉద్దేశిస్తూ అతడు ఈ లేఖ రాశాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తి రాసిన ఈ లేఖపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీని కాపీలను అమికస్ క్యూరీ అనుపమ్ గుప్తాకు అందచేసింది. తాజా లేఖలో అజ్ఞాతవ్యక్తి చేసిన ఆరోణలతో హర్యానా పోలీసు అధికారుల్లో గుబులు పుట్టిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: