బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పుడు బీజేపీ ఏకంగా చంద్రబాబుకు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయా అని ప్రశ్నించే రేంజ్ కు చేరుకుంది. ప్రధాని మోడీని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో చేసిన వ్యాఖ్యల్ని బిజెపి నేతలు తప్పుబడుతున్నారు. దేశ ప్రధానిపై గతంలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు..

Image result for vishnukumar raju AND MADHAV

చంద్రబాబుకు పాకిస్థాన్ వంటి దేశాలతో చంద్రబాబుకు ఏమైనా సంబంధాలున్నాయా విష్ణుకుమార్ రాజు కేంద్ర ప్రభుత్వ వాహనాలు రాష్ట్రంలో తిరగనీయబోమని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం ఏమిటన్నారు. ఇకపై రైళ్లు, విమానాలు, నౌకలు తిరగకుండా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. అంతే కాదు.. విద్యార్థుల్ని రోడ్లపైకి తీసుకువచ్చేలా అధికారులతో జీవోలు ఇప్పించటం ఏమిటని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ బాగా పెరిగిపోయిందని ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్ చేశారు. 

Image result for BJP VS TDP
విష్ణుకుమార్ రాజు, మాధవ్ కామెంట్లపై టీడీపీ మండిపడింది. శాసన మండలి విఫ్ బుద్ద వెంకన్న, శానసమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కౌంటర్ ఎటాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్   ప్రజల మనోభావాలు నరేంద్ర మోడీ దగ్గర  బీజేపీ నాయకులు  తాకట్టు పెట్టారని విమర్శించారు. విష్ణుకుమార్ రాజుది 4 సంవత్సరాల రాజకీయ జీవితమేనని.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ది  40 సవత్సరాల రాజకీయజీవితం అనే విషయం మరిచిపోయి విమర్శలు చేస్తున్నారన్నారు. 

Image result for buddha venkanna

వైసీపీ అధినేత  వైస్ జగన్ స్క్రిప్ట్ తోనే బీజేపీ నేతలు ఇలా మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు లో  అవిశ్వాసం నోటీస్ ఇస్తే ఒక గంటలో 100 మంది పార్లమెంటు సభ్యులు  సపోర్ట్ చేశారన్నారు.  తనకన్నా సీనియర్‌ ప్రధాని అయిన మన్మోహన్‌ సింగ్ పైనరేంద్ర మోడీ ఆరోపణలు ఆయన స్థాయి దిగజార్చేవిగా ఉన్నాయన్నారు. విష్ణుకుమార్ ర్రాజు వళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.  బీజేపి బీ ఫారం మీద  2019 లో పొటీ చేసే  ధైర్యం ఉందా మీకు అని ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: