లేటు వయసులో ఘాటు కోరికలు ఎంతటివారికైనా చేటు తెస్తాయి.. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ గవర్నర్ గా ఉన్న ఎన్డీ తివారీ ఇలాగే చిక్కుల్లో పడ్డారు. అవమాన భారంతో ఆయన రాజీనామా చేసి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరో గవర్నర్ కూడా అదే పరిస్థితుల్లో చిక్కుకుంటున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడు గవర్నర్ పురోహిత్ వ్యవహారంపై ఇప్పుడు తమిళనాడుతో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆ తాత దగ్గర పడుకుంటే డిగ్రీ వస్తుందంటూ ఓ మహిళా ప్రోఫెసర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యవహారంపై విచారణ జరిపించాలని విపక్షాల డిమాండ్ చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. దీంతో ఇబ్బందుల్లో పడిన గవర్నర్ ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి తనపై వచ్చిన వార్తలను ఖండించాల్సి వచ్చింది. ప్రోఫెసర్ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటలోని దేవాంకుర్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యభిచారం చేయాలంటూ విద్యార్థినులను ఒత్తిడి చేస్తున్నట్లు చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే నేను చెప్పే వారికి సుఖం అందించు.. ఆ తాతగారిని సుఖపెడితే.. డబ్బుతో పాటు సంఘంలో మంచి స్థితికి చేరుకోవచ్చు. నేను చెప్పినట్లు వింటే నీ భవిష్యత్తు బావుంటుంది’’ అంటూ ఓ విద్యార్థినితో ఆమె ఫోన్ లో మాట్లాడింది.
ఇప్పుడు ఆ ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా గగ్గోలు మొదలైంది. దీంతో ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంపై విచారణ జరిపేందుకు యూనివర్సిటీ ముందుకొచ్చింది. సెనేట్ సభ్యుడి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. మరి ఈ వివాదం నుంచి గవర్నర్ ఎలా బయటపడతారో చూడాలి.