ఇటీవల చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా ఒక్క రోజు నిరాహరదీక్ష చేసి మోడీకి నిరసన తెలిపారు. ఆ సభలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందీలో చేసిన ప్రసంగం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలే ఊ..ఆ.. అంటూ మాట్లాడే బాలకృష్ణ ఏకంగా హిందీలో మోడీకి వార్నింగ్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఆ క్రమంలో కొన్ని బూతులు కూడా అలవోకగా జాలువారాయి.

SAIKUMAR ELECTIONS కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు దీక్ష కన్నా బాలకృష్ణ బూతులకే ఎక్కువ ప్రచారం లభించింది కూడా. బీజేపీ నేతలు బాలకృష్ణ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు కూడా.  అయితే దీనిపై టీడీపీ నుంచి మాత్రం ఎలాంటి క్షమాపణ రాలేదు. బాలయ్య మాత్రం తన ప్రసంగంలో బూతులు లేవని కావాలంటే మరోసారి వినాలని ఉచిత సలహా పడేసి చేతులు దులుపుకున్నారు. 

SAIKUMAR ELECTIONS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు తాజాగా బాలయ్య కామెంట్లపై ప్రముఖ నటుడు, బీజేపీ నేత సాయి కుమార్ స్పందించారు. హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తరపున తాను ప్రదాని మోడీకి క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు. కర్నాటకలోని బాగేపల్లిలో బిజెపి తరపున పోటీచేస్తున్న సాయికుమార్ ఈ అంశంపై స్పందించడం విశేషం. బాలకృష్ణ తో కలిసి తాను పలు సినిమాలలో నటించానని, ఆయనతో తనకు మంచి సంబందాలు ఉన్నాయని సాయికుమార్ అంటున్నారు.  

SAIKUMAR ELECTIONS కోసం చిత్ర ఫలితం
తాజా పరిణామాల నేపద్యంలో ఆయనను తన ప్రచారానికి కూడా పిలవలేకపోతున్నానని సాయికుమార్ బాధపడ్డారు. ఆవేశం గా బాలకృష్ణ మాట్లాడుతుంటారని.. వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా సాయి కుమార్ మెత్తగా చెప్పుకొచ్చారు. అంతే కాదు..  ప్రత్యేక హోదా విషయంలో తాను కూడా ప్రధానిని అభ్యర్ధిస్తానని, కాళ్లు పట్టుకుంటానని సాయికుమార్ అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: