కొన్నిరోజులుగా పవన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రోజూ ట్వీట్ల దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా తన కొత్త పలుకు సంపాదకీయంలో కూడా పవన్ ను ఏకిపారేశాడు రాధాకృష్ణ.. అయితే అందులో పవన్ ను శ్రీరెడ్డి తిట్టిన తిట్టు అంత పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని.. అది చాలా సాధారణమని రాసుకొచ్చాడు రాధాకృష్ణ.

PAWAN VS RADHAKRISHNA కోసం చిత్ర ఫలితం

దీంతో తిక్కరేగిన పవన్ కల్యాణ్.. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మళ్లీ తెలుగుదేశం మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా ప్రముఖుడికి ఇప్పటికే బూతురత్న బిరుదు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆయనను ఎద్దేవ చేస్తూ బొంబాయిలో ఇంతే అని అన్న వ్యాఖ్యను వివరించారు. ‘బొంబాయిలో అంతే.. బొంబాయిలో అంతే’ అంటూ ‘బూతురత్నం’పై సెటైరికల్‌ కామెంట్‌ను పవన్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత చిత్రం
పవన్‌ కల్యాణ్‌ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లలో చాలా సర్వసాధారణమని ‘బూతురత్నం’ అంటున్నాడని, మరీ ఈ లాజిక్‌ను బట్టి ఇతనిని ప్రజలందరూ అలా పిలిచినా తప్పు అనుకోడు.. అంటూ రాధాకృష్ణ ఎద్దేవా చేస్తూ ఉన్న కామెంట్‌ను ఆయన స్మైలీ ఎమోజీతో షేర్‌ చేశారు. ‘మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు.. నేను కమ్యూనిస్టును కాకపోవడంతో మాట్లాడలేదు’ అంటూ ప్రఖ్యాత రచయిత మార్టిన్‌ నీమోలెర్‌ కవితను పవన్‌ షేర్‌ చేశారు.



తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నటిడిపి మీడియా చానెళ్లకు నోటీసులు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. అయితే దీంతో ఆగ్రహించిన ఆంద్రజ్యోతి రాదాకృష్ణ పవన్ కు లీగల్ నోటీసు పంపించారు. తన పరువుకు బంగం కలిగించేలా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ,దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: