ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్య రాజకీయ పరంగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రస్తుతం టీడీపీ నేత అయిన ఆనం వివేకానంద రెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో  కన్నుమూశారు.  ఆనం మరణ వార్త విని టీడీపీ నేతలు షాక్ అయ్యారు.  ఇదిలా ఉంటే..నిన్న బీజేపీకి గుడ్ బాయ్ చెప్పిన కన్నా లక్ష్మినారాయణ వైసీపీలో చేరబొతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్ర అస్వస్థత కు లోనయ్యారు.   
Image result for ysrcp
ఈరోజు తెల్లవారు జామున హైబీపీ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కన్నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్తతకు గురైన కన్నా లక్ష్మీనారాయణకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.  కాగా, నిన్న బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు జగన్ పార్టీలో చేరాల్సి ఉంది.
Image result for ysrcp jagan
ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో తన అనుచరులతో కలసి వచ్చి కన్నా వైసీపీలో నేడు చేరాలనుకున్నారు.తన రాజకీయ భవితవ్యంపై కొన్ని రోజులుగా తన అనుచరులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడికిలోనై అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. దీంతో ఇవాళ వైసీపీలో చేరతారా? లేదా వాయిదా వేస్తారా అని రాజాకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: