భారత దేశంలో ప్రతిరోజు మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లతో పాటు దేశ రాజధాని లో కూడా అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆ అకృత్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఈ దారుణ సంఘటన  ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో చోటుచేసుకుంది.   
Related image
వివరాల్లోకి వెళితే..ఈ నెల 24న యువతి తాగునీటిని తెచ్చేందుకు గ్రామ శివారులో ఉండే బావి వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసిన స్థానికులు తాలిబ్‌, సల్మాన్‌లు యువతి నోట్లో గుడ్డలు కుక్కి అపహరించుకు పోయారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా అది వీడియో షూట్ చేసి ఆ యువతిని బెదిరించారు. తనకు జరిగిన అన్యాయం బయట పడితే..తన కుటుంబ పరువు పోతుందని ఆ యువతి ఎవరికీ చెప్పలేదు.
Image result for uttar pradesh girl raped
కానీ ఆ దుర్మార్గులు లైంగిక దాడిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వీడియో వైరల్‌ కావడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కాగా, మా యువతి పరువు దారుణంగా పోయిందని..సోషల్ మీడియాలో వీడియో డిలీట్ చేయాలని..దంటే మా కుటుంబం మొత్తం ఆత్మాహుతి చేసుకుంటుంద’ని బాధిత యువతి సోదరి పోలీసులను వేడుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: