కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నాయకులు, జయనగర్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ హఠాన్మరణం పొందారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వారం కిందట చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రచారానికి వెళ్లి గుండెనొప్పితో పడిపోయారు. జయనగర్ నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే చికిత్స జరగడంతో ప్రచారానికి వెళ్లవద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

పార్టీ కోసం ఆయన మొదటి నుంచి పాటుపడే వ్యక్తిగా తాను ప్రచారం చేస్తాని వెళ్లారు.   హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కిందపడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూశారు.ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసింది. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, విజయకుమార్ మృతితో పార్టీకి తీరని నష్టం కలిగిందని ఆ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేసింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. విజయకుమార్ కుటుంబసభ్యులకు కర్ణాటక బీజేపీ ప్రగాఢ సంతాపం తెలిపింది.  కాగా, విజయ్ కుమార్ ఇప్పటికే అవివాహితుడే..ప్రజా సేవ కోసమే తన జీవితం అంకితం చేశారని.. పార్టీలో ఎంతో చురుకుగా ఉండేవారిని పార్టీ సభ్యులు అన్నారు. విజయ్ కుమార్ బీజేపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: