ఆనవాయితీ ప్రకారం ప్రతియేటా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసి ప్రకటించిన 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ 2017వ సంవత్సరానికి గాను ప్రకటించారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక "టైమ్స్ ఆఫ్ ఇండియా" 2017 సంవత్సరానికి గాను తాజాగా "మోస్ట్ డిజైరబుల్ మెన్" జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో "టాప్-టెన్" లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలకు చోటు దక్కడం విశేషం.
*బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్గా స్టార్డం సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాబితాతో రెండో స్థానంలో నిలిచాడు.
*అలాగే సూపర్స్టార్ మహేష్ బాబు ఆరో స్థానం,
*దగ్గుబాటి రానా ఏడో స్థానం దక్కించుకున్నారు.
*బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ తొలి స్థానం కైవసం చేసుకున్నాడు.
*ఇక మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,
*నాల్గో స్థానంలో హృతిక్ రోషన్, ఐదో స్థానంలో సిద్ధార్థ్ మల్హోత్రాలు నిలిచారు.
*మలయాళ కథనాయికుడు దుల్కర్ సల్మాన్, అర్జున్ రాంపాల్ తో కలిసి తొమ్మిదో స్థానం దక్కించుకోవడం విశేషం.
క్రేజ్తో పాటు పాపులారిటీ ఆధారంగా ప్రతి ఏడాది 50 మందితో కూడిన "మోస్ట్ డిజైరబుల్ మెన్" జాబితాను ప్రముఖ దినపత్రిక "టైమ్స్ ఆఫ్ ఇండియా" విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.