నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు అమ్మాయిల ఉసురు ధారుణంగా తగలనుందని ఆయన పతనం ఇక ప్రారంభ మైనదని అంటున్నారు దివంగత తెలంగాణా నటీమణి ప్రత్యూష తల్లి సరోజిని.
సినీ నటి ప్రత్యూష, అర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి, మెడికో సంధ్యా రాణి రెవెన్యూ అధికారిణి వనజాక్షి ఈ నలుగురూ చంద్ర బాబు సామాజిక వర్గానికి చెందినవారి బాదిత మహిళలు.
ఆమె పదహారు సంవత్సరాల క్రితం కొందరు దుర్మార్గుల దౌష్ట్యానికి బలై మరణించిన తన కుమార్తె తెలంగాణా నుండి తారస్థాయి కి ఎదుగుతున్న నాటి వర్ధమాననటి మరణంపై సరైనవిచారణ జరగక పోవటానికి కారణం చంద్రబాబు పాలన మాత్రమే నన్నారు తన కూతురు మరణం లో చంద్రబాబుకు సంబందించిన వారి పాత్ర ఉండి ఉండవచ్చని అందుకే నా కూతురు మరణానికి సంభందించిన సాక్ష్యాలు, సాక్షులను తారుమారు చేశారని అందుకే సిబీఐ కి సరైన సాక్ష్యాలు దొరకక పోవటంతో ఆ కేసును చేదించ లేకపోయిందని ఆమె తన అభిప్రాయం తెలిపింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్యకు అర్కిటెక్చర్ కాలేజీ నిందితులైన విద్యార్దులతోపాటు ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఆయన అండదండలతోనే విశ్వవిద్యాలయంలో అరాచకాలు సాగుతున్నాయని కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపింది. కాలేజీలోని అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మందు పార్టీలు చేసుకుంటున్నారని కమిటీ తేల్చింది. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని, ఆయన అండతోనే కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని చెప్పింది. రిషితేశ్వరిని లైంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి అభ్యంతరకర ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ సహకారంతోనే జరిగాయని విచారణ కమిటి చెప్పింది. ఇక్కడ బాబురావు చంద్రబాబు సామాజిక వరగానికి చెందినవారట. అందుకే ఆ కేసు క్లోస్ చేసి ఉంటారని జనంలో ప్రతీతి.
గుంటూరు కు చెందిన వీరు బాబుగారి సామాజిక వర్గానికి చెందిన వారేనట. ప్రిన్సిపాల్ బాబూరావును వెంటనే అరెస్టు చేయాల ని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, చంద్రబాబు నాయుడు బంధువని చెప్పు కుంటున్న ప్రిన్సిపల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి రాసిందని చెబుతున్న రెండు లేఖలను ఆధారం చేసుకుని దర్యాప్తు కొనసాగాలని ఆమె నాడు డిమాండు చేశారు.
ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు
మెడికో సంధ్యారాణి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంధ్యారాణి
ఆత్మహత్యను తట్టుకోలేక మిర్యాలగూడలో ఉంటున్న సంధ్యారాణి భర్త డాక్టర్ రవి ఉరి వేసుకుని
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలంటూ విద్యార్థులుపెద్ద
యెత్తున ఆందోళనకు దిగారు. అయితే, పోలీసు శాఖలోని ఒక ఉన్నతాధికారితో పాటు ఓ రిటైర్డ్
న్యాయమూర్తి, అధికార నేతల సలహా మేరకు బెయిల్ వచ్చే వరకు పోలీసులకు చిక్కకుండా తలదాచుకోవాలని
నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే విచారణ కాలంలో ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు
16 నగరాలకు ఒకదాని తరవాత ఒక నగరానికి మకాం మార్చుతూ తిరిగినట్లు అప్పుడు చెప్పారు.
ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇది కలకలం రేపింది. రెవెన్యూ సంఘాలు వనజాక్షికి అండగా నిలిచాయి. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సంఘాలతో చర్చించారు. వనజాక్షిపైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు.
ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్
స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షపై
దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును
సుమోటోగా తీసుకుంది.
చివరకు ఈ కేసులో చంద్రబాబు వనజాక్షిని మందలించారు అని వార్తలు వచ్చాయి. ఆ తరవాత ఆమెకు బదిలీ కూడా అయింది. చింతమనేని ప్రభాకర్ వనిత అని కూడా చూడకుండా ఆమె జుట్టుబట్తి ఈద్చారని నాటి వార్తలు. చివరకు తేలిందేమంటే చింతమనేని కూడా చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందినవారే. టిడిపి శాసనసభ్యుడే. ఆయనపై 20కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
దాచేపల్లి నిందితుడు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం జనం నుంచి వెల్లువెత్తిన ప్రజాగ్రహమే. ఇక్కడ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. పసివాళ్లనే కాదు మహిళలపై జరిగే దురాగతాలను చంద్రబాబు అడ్డుకున్నదేమీ లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మగువలకు చేసిన మేలు కూడా శూన్యం.