కన్నడిగులు సాధారణంగా సౌమ్యులు. అలాగే దెబ్బకొట్టకుండా ఎవరికీ కనపడని తొడపాశం పెట్టగల చతురులు. కన్నడ ఓటర్లు కనీవిని ఎరుగని రీతిలో తీర్పు ఇచ్చారు. వారు తలా కొంత పంచారు తప్ప ఏ ఒక్కరికీ అంతా పంచకుండా, సంతోషం పంచటంలో సమానత్వం పాటించారు. పోటీ చేసిన ఏ పార్టీని పూర్తిగా బాధపెట్టలేదు. పోటీ చేసిన ఏ పార్టీకి గంప గుత్తగ్గా సంతోషం పంచ లేదు. తలా ఇంత బాధను, తలా ఇంత సంతోషాన్ని పంచి సమానత్వం పాటించారు కన్నడిగులు. 


సంక్షిప్తంగా ఇంతగా ఎందుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చారో తెలుసుకుందాం రండి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దేశ ప్రజల్లో ఆసక్తిని రేపాయి: ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. 
karnataka election results 2018 కోసం చిత్ర ఫలితం

తర్వాత ట్రెండ్ బిజెపి వైపు మళ్లింది. బిజెపి బాగానే దూసుకుపోయింది. తీరా 114 వరకు సాధిస్తుందని అనుకుంటున్న దశలో బిజెపికి 10 సీట్లు కోతపడ్డాయి. 104 దగ్గర ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు సీట్లు ఎక్కువే వస్తాయనుకుంటున్నవేళ 8సీట్లు మైనస్ అయ్యాయి. డాంతో  బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ బిజెపికి అధికారం ఇవ్వకుండా బాధపెట్టిన కన్నడిగులు బిజెపికి అసెంబ్లీలో వందకు పైగా అంటే అత్యధిక సీట్లు ఇచ్చి కొద్దిగా సంతోషం పంచారు.


ఈ సారి ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, దేశ వ్యాప్త సర్వేలు చెప్పాయి. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కానీ ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా వెనుక బడింది. ఆ పార్టీకి 78 సీట్లే వచ్చాయి. ఇక అధికారం చేజారిపోయిందన్న బాధను మిగిల్చారు కన్నడ ఓటర్లు ఇక్కడ కాంగ్రెస్ కు కూడా ఒక సంతోషాన్ని మిగిల్చారు. బిజెపికి  అత్యధిక సీట్లు ఇచ్చి సంతోషం పంచినట్లే కాంగ్రెస్ కు అత్యధిక ఓట్లు ఇచ్చి కొద్ది సంతోషాన్ని పంచారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు ఎక్కువ.

ఇక జెడిఎస్ ‘హంగ్ లో కింగ్ ‘ అని మొదట ఎక్కువ సంఖ్యలో సర్వేలు చెప్పాయి. తర్వాత జెడిఎస్ తో అవసరమే లేకుండా అధికారాన్ని చేజిక్కించుకుంటామని బిజెపి ప్రకటించింది. ఒక దశలో జెడిఎస్ గత సీట్లను కూడా నిలుపు కుంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. సీట్లు, ఓట్లు రెండూ జెడిఎస్ కు తక్కువగానే వచ్చాయి. ఈ విషయంలో జెడిఎస్ ను బాధపెట్టిన కన్నడ ఓటర్లు అంతిమంగా జెడిఎస్ పార్టీకి సిఎం సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ మేరకు జెడిఎస్ ను సంతోష పెట్టారు. 

siddaramaiah, yeddyurappa, kumaraswamy కోసం చిత్ర ఫలితం

జెడిఎస్ కు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. జెడిఎస్ కు సిఎం పోస్టు, కాంగ్రెస్ కు ఉపముఖ్యమంత్రి పోస్టులు తీసుకుంటారని, 14 మంది మంత్రులు జెడిఎస్ 20 మంది మంత్రులు కాంగ్రెస్ వారు పంచుకుంటాదామని అప్పుడే ఒప్పందం జరిగిందట. 

ఈ నేఫథ్యంలో ఇప్పటికే అంతర్జాలంలో ఆశక్తి కలిగించే ఒక పోస్టు కన్నడ ఫలితాల మీద వైరల్ అవుతోంది. 


ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు సీట్లు పంచేసుకుంటే - అంటే 38 మార్కులు వచ్చినోడికి ముఖ్యమంత్రి సీటూ, 78 మార్కులొచ్చినోడికి మిగతాపదవులూ, 104  మార్కు లొచ్చి నోళ్ళం మేమేమవ్వాల్లని కథను రాజభవన్ తీసుకెళ్ళింది బాజపా! తాంబూలాలిచ్చిన కన్నడ ఓటర్లు వాళ్ళు తన్నుకు చస్తుంటే  ఎంజోయ్ చేస్తున్నారు. 

kannada governor residence కోసం చిత్ర ఫలితం

kannada governor residence కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: