ఈ మద్య ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే ప్రతీ వింత ఇట్టే వైరల్ అవుతుంది.  అప్పుడప్పుడు వింత శిశువుల జననం గురించి వింటున్నాం..తాజాగా మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో ఓ విచిత్రం జరిగింది. మత్స్యకన్య లక్షణాలతో జన్మించిన ఓ బిడ్డ, 15 నిమిషాల తరువాత మరణించింది.  ఓ పాప అత్యంత అరుదైన సెరినోమిలియా (దీన్నే మర్ మెయిడ్ సిండ్రోమ్ గా కూడా పిలుస్తారు) లక్షణాలతో జన్మించిందని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

ఆమె కాళ్లు అతుకుపోయి ఉన్నాయని అంబజోగాయ్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ ప్రభుత్వ వైద్యశాల గైనకాలజిస్టు డాక్టర్ సంజయ్ బన్సోడే వెల్లడించారు.  సాధారణంగా మనం కథల్లో వింటుంటాం..మత్సకన్యల గురించి..ఇప్పుడు ఆ చిన్నారి మత్సకన్యలా జన్మించడంపై అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక  సెరినోమిలియా  వ్యాధి, బిడ్డ గర్భంలో పెరిగే సమయంలో దిగువ వెన్నెముక ఎదుగుదల లోపం కారణంగా వస్తుందని ఆయన తెలిపారు. ఆమె తల్లి దీక్షా కాంబ్లీని సోమవారం ఉదయం 7 గంటల సమయంలో కాన్పు నిమిత్తం తీసుకు వచ్చారని, ఆపై ఆమె 1.8 కిలోల బరువున్న బిడ్డను కందని, ఆ బిడ్డ పుట్టిన 15 నిమిషాల తరువాత మరణించిందని, తల్లి క్షేమమేనని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: