ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వేల ఎకరాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పబడుతున్న పోలవరం ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతు నత్తనడకన సాగుతూ వస్తుంది. తాజాగా ఏపి ప్రభుత్వానికి ఊరట ఇచ్చే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలు హల్ చల్ చేస్తుంది. నాబార్డ్, కేంద్ర జల వనరుల శాఖ, జల వనరుల కమిషనర్, కేంద్ర ఆర్థిక శాఖ మధ్య కుదిరిన ఎంవోఏకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఈ ఫైలు కేంద్ర జల వనరుల శాఖకు చేరింది.
గత కొంత కాలంగా సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పనితీరు, వాటి అవశ్యకతలపై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. పథకము' గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక పథకం. పథకము' గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక పథకం.
' గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు.
పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్ గఢ్, ఒరిస్సాలలోకి కూడా విస్తరించి ఉంటుంది. కాగా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటే కేంద్రం తమతో మళ్లీ ఎంవోఏ (మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాలని నాబార్డ్ గతంలో స్పష్టం చేసింది. ఫలితంగా కొత్త ఎంవోఏ సిద్ధమైంది. ఇప్పుడది ఆమోదం పొందడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు గతేడాది చెల్లించాల్సిన రూ.1089 కోట్లను కేంద్రం ఇప్పటికైనా విడుదల చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.