భారత దేశంలో బ్యాంకులను సర్వం ముంచి వెల కోట్లు దండుకొని విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్య, నిరవ్ మోదీ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ముంబైలోని స్కాండియా హౌస్ లో ఉన్న ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  అయితే ఇదే కార్యాలయంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ తదితర డిఫాల్టర్ల దస్త్రాలు దాచి ఉంచడం జరిగింది.  అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందీ అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 
Income Tax office burnt to crisp
అగ్ని ప్రమాదం సంబవించగానే వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ముఖ్యమైన ఫైల్స్ వెంటనే అక్కడ నుంచి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు.  భవంతిలోని మూడు, నాలుగు, ఐదో అంతస్తుల్లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఐటీ శాఖ కార్యాలయంలో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన బడాబాబులకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి.
Image result for mallya nirav modi
అంతే కాదు  భవంతిలో చిక్కుకున్న ఆరుగురిని ప్రాణాలతో రక్షించామని, దాదాపు 120 మంది ఫైర్ మెన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారని డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర చౌదరి వెల్లడించారు. ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కాగా, ఏ కారణంతో భవనానికి నిప్పంటుకుందన్న విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: