ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాలు, అన్యాయాలను ఎండగడుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండువేల కిలోమీటర్లు పాద యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..రాజన్న మళ్లీ వచ్చాడని ఆయనకు గుండెకు హత్తుకుంటున్నారు. తమ గోడు విన్నవించుకుంటూ..నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జగన్ పాదయాత్రలో గురువారం అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో పది మంది వరకు గాయపడ్డారు. తేనెటీగల దాడి నుంచి జగన్ సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.