భారత దేశంలో కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో ప్రశాంతంగా, కనువిందు చేసే ప్రకృతి అందాలతో నిత్యం పర్యాటకులతో అలరారే ఊటీ నెత్తురోడింది. ఊటీ నుంచి కూనూరు వెళ్లే మార్గంలో 50 అడుగుల లోయలో ప్రభుత్వ బస్సు పడిపోయింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 15మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8మంది విషమంగా ఉంది.  ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో లోయల పడిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉంది. ముక్కలు ముక్కలైన బస్సు శకలాల నడుమ విగతజీవులైన ప్రయాణికులు, రక్తచారికలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. 

 క్షతగాత్రుల ఆహాకారాలతో అక్కడి వాతావరణం ఎంతో హృదయవిదారకంగా తయారైంది. సరికొత్త అందాలకు నెలవు అయిన ఊటిలో ఘోర ప్రమాదం జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: