ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు బాగా పెరిగిపోతున్నాయి.   ప్రతిరోజూ ఎక్కడో అక్కడ స్త్రీలపై అఘాయిత్యాలు మాత్రమే కాదు దారుణ హత్యలకు కూడా తెగబడుతున్నారు కొంత మంది దుండగులు.  తాజాగా నగరంలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది.   ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఓ మహిళల మృతదేహం కలకలం సృష్టించింది. 

సాధారణంగా ఎర్రగడ్డ మానసిక వైద్యాలయం అని అందరికీ తెలిసిందే..ఇక్కడ ఓ దారుణమైన హత్య జరగడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ రెండు కాళ్లను అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు.

ఆసుపత్రి భవనంపై నరికిన కాళ్ల ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. విషయం తెలిసిన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతి చెందిన మహిళకు దాదాపు 35 సంవత్సరాలు ఉంటాయని..చనిపోయిన మహిళ ఎవరు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: