భారత దేశంలో ప్రజలు చాలా మంది భగవంతుడు అంటే ఎంతో భక్తితో ఉంటారు.  ఇక దైవాంశ సంభూతులుగా చెప్పుకునే బాబాలను కూడా ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు..గౌరవిస్తారు.  కానీ ఈ మద్య దేశంలో బాబా అంటే భయపడిపోతున్నారు.  సర్వసంగ పరిత్యాగులం...మాకు ఏ ఐహిక సుఖాలు అవసరం లేదు అంటూ బయట చెప్పుకుంటూనే..కామకేళిలో మునిగిపోతున్నారు...అక్రమార్జనకు తెరలేపుతున్నారు.  ఇలాంటి దొంగ బాబాలు గల్లి గల్లీకి పుడుతూనే ఉన్నారు. 

ఇలాంటి దొంగ ముసుగులో ఉన్న బాబాల గురించి తెలియక వారిచేతిలో ధన, మాన, ప్రాణాలు కోల్పోతున్నారు మహిళలు.  తాజాగా దొంగ బాబాలపై యోగ గురు రాందేబ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు.  దేశంలో భక్తితో పూజించే ప్రజలను కొంత మంది దొంగ బాబాలు దారుణంగా మోసం చేస్తున్నారని..  తమకు తాముగా దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాబాలందరినీ ఉరితీయాలని యోగా గురు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. 

అంతే కాదు తమ పరిధులను దాటి ప్రవర్తించే వారందరినీ జైళ్లకు పంపించాలని, చచ్చేవరకూ బయటకు రానీయకుండా చూడాలని, ఈ విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం దయా, దాక్షిణ్యం లేకుండా ఉండాలని రాజస్థాన్ లోని కోటా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చెప్పారు. అంతే కాదు కాషాయం వేసుకున్నంత మాత్రాన బాబా అయిపోరని..నాయకులు అయిపోరని అభిప్రాయపడ్డారు.

ఏ వృత్తిలోనైనా చేసే పనికి కొన్ని పరిమితులు ఉంటాయని, అదే బాబాలకూ వర్తిస్తుందని, కేవలం కాషాయ వస్త్రాలు ధరించి బాబాలుగా పిలిపించుకునే వారు పెరిగిపోయారని మండిపడ్డారు. దాతీ మహరాజ్ పై వచ్చిన అత్యాచార ఆరోపణలు ప్రస్తావనకు వచ్చిన వేళ బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: