గత కొంత కాలంగా భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి..ముఖ్యంగా బిహార్, యూపి, దేశ రాజధాని ఢిల్లో ఈ అకృత్యాలు రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి. మరీ దౌర్భాగ్యం ఏంటంటే..ఈ మద్య కామాంధులు చిన్నారులపై రెచ్చిపోతూ వారిపై అత్యాచారాలు మాత్రమే కాదు హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా ఘజియాబాద్లోని మదర్సాలో పదేళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత బాలికను ఇద్దరు దుండగులు మాయమాటలు చెప్పి ఐస్క్రీమ్ పార్లర్కు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఘజియాబాద్లోని మదర్సాకు తీసుకువెళ్లి మరో నిందితుడితో కలిసి దారుణానికి పాల్పడ్డారు.
నేరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితుడు తన ఫోన్తో పాటు బాధితురాలి ఫోన్ను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. అయితే బాలికను ప్రలోభ పెట్టిన యువకుడు తప్పించుకున్నట్లు.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.