సాధారణంగా మనం ఎన్నో చిత్రాల్లో చూస్తుంటాం..హీరో, హీరోయిన్లు గాఢమైన ప్రేమలో ఉంటారు..పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలన్న వారి కోరికను ఎలా భగ్నం చేస్తారో ఆ సన్నివేశాలు ఎంత దారుణంగా ఉంటాయో తెరపై చూపిస్తారు.  ప్రేమికుల మద్య విలన్లు ఎంట్రీ ఇవ్వడం హీరోని చితకబాది హీరోయిన్ ని ఎత్తుకెళ్లడం చూశాం. 

తాజాగా నిజామాబాద్ జిల్లా ఇందూరు గ్రామంలో అచ్చం సినీ ఫక్కీలో ప్రేమికుడిని చితకబాది అమ్మాయిని పబ్లిక్ గా ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  వివరాల్లోకి వెళ్లితే ప్రాణదీప్, సౌజన్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పడంతో మేజర్‌లయిన ప్రాణదీప్‌, సౌజన్య అక్కడి ఆర్యసమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు వచ్చారు.

మరో ఐదు నిమిషాల్లో పెళ్లి ముగుస్తుందనగా.. అక్కడికి వచ్చిన అమ్మాయి తరఫు బంధువులు ప్రాణదీప్‌పై దాడి చేశారు. అడ్డు వచ్చిన సౌజన్యపై కూడా చేయి చేసుకొని ఆమెను బలవంతంగా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.  దాంతో ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాము మేజర్లమని పెళ్లి చేసుకోవడానికే ఆర్యసమాజ్ వెళ్లామని..ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుండగా దాడి చేశారని చెప్పాడు. కాగా, యువతిని తీసుకెళుతుండగా స్థానికులు స్మార్ట్‌ఫోన్‌లలో వీడియో తీశారు.   ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: