ఎంతటి వారైనా..కొన్ని సార్లు పడే తిప్పలు చూస్తే నిజంగా షాక్ తింటారు.  ముఖ్యంగా లిఫ్ట్ లో వెళ్లే వారు ఒక్కసారే లిఫ్ట్ ఆగిపోయినా..ఎదైనా ప్రమాదం జరిగినా అందులో ప్రయాణించే వారి పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుందన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అంతే కాదు కొన్ని సార్లు లిఫ్ట్ లో ప్రయాణించే వారు ప్రమాదాల్లో చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. 
Image result for బుద్ధా రాజశేఖర్ రెడ్డి
తాజాగా టీడీపీ నేతలు 15 నిమిషాల పాటు లిఫ్ట్ లో నానా అవస్థ పడ్డారు.    శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మీనాక్షి నాయుడు లిఫ్ట్‌లో ఉండిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరచి టీడీపీ నేతలు బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటన విజయవాడలోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
Image result for lift
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కర్రలు, రాడ్లతో లిఫ్ట్ తలుపులు తెరిచి, వారిద్దరినీ క్షేమంగా బయటకు తీశారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా చల్లా రామకృష్ణారెడ్డి ఈ రోజు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన సంభవించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: