ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నేత కొంత కాలంగా ‘ప్రజా సంకల్ప యాత్ర’తో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని..కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నాలుగు సంవత్సరాలు పబ్బం గడిపారని..ఇంకా ప్రజలను మోసం చేసే మాటలే మాట్లాడుతున్నారని జగన్ అంటున్నారు.   

ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నేడు 197వ రోజు సాగింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. వైఎస్ జగన్ కి ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుంది..ఎక్కడికి వెళ్లిన గుండెల్లో పెట్టుకుంటున్నారు. 
Image result for ys jagana prajasankalpa yatra
నిజంగా తమ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ వస్తున్నారా అన్న మాటలే వినిపిస్తున్నాయి.  గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా చేశారు. ఆ చిన్నారితో పలకపై ‘వైఎస్’ అనే అక్షరాలను రాయించి దిద్దించారు. కాగా, జగన్ చేపట్టిన పాదయాత్ర  లక్కవరం వద్ద 2,400 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: