వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర లో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను బాధలను వింటూ వారికి ధైర్యాన్ని పుట్టిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అనారోగ్య పాలైన అభాగ్యులు కనీసం వైద్యం ఖర్చు కూడా లేనివారు జగన్ దగ్గర తమ బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు జగన్ స్వయంగా తన దగ్గర వున్న సిబ్బంది చేత తన సొంత డబ్బుతో వైద్యం చేయించినా సందర్బాలు ప్రజా సంకల్ప పాదయాత్ర లో ఎన్నో ఉన్నాయి...
Image may contain: 7 people, outdoor
అలాగే నిజజీవితంలో కూడా జగన్ ఇటువంటి సహాయాలు సహకారాలు అందించిన సందర్భాలు ఎన్నో. ఇదిలావుండగా తమ అధినాయకుడు చేస్తున్న పనిని బట్టి వెనక ఉన్న వైసీపీ పార్టీ నాయకులు కుడా బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వైసీపీ పార్టీకి చెందిన కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇంటికి వస్తున్న సమయంలో  దారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Image may contain: 3 people, people sitting
ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే శ్రీవాని తన వాహనాన్ని ఆపించి పరామర్శించారు.అంతేకాకుండావెంటనే 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి పంపించారు.మరికొంతమందిని తన వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి పంపించి దగ్గరుండి మరీ వైద్యం చేపించారు.ఎప్పటికప్పుడు పరిస్థితి ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Image may contain: 2 people, people sitting
అయితే ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. తన వాహనాలో ఎక్కించుకొని వెళ్లి దగ్గరుండి వైద్యం చేపించడం పట్ల స్థానిక ప్రజలు మరికొంతమంది ఆసుపత్రిలో ఉన్న వారు ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి మోక్కుతున్నారు. నాయకుడికి తగ్గ నాయకురాలు అని ఎమ్మెల్యే శ్రీ వాణి ని పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు స్థానిక ప్రజలు.


మరింత సమాచారం తెలుసుకోండి: